Sunday, June 29, 2025

గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూస్ టివి ఛానల్‌పై దాడి ఘటనలో నిందితుడిగా బిఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను శనివారం రాత్రి తెలంగాణ భవన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం ఘటన జరిగిన తర్వాత నిందితుల కోసం పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. దాడికి పాల్పడ్డ నిందితులు బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో తలదాచుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించుకుని భారీ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. దాంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులను నివారించేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. కొందరు పోలీసులు తెలంగాణ భవన్‌లోపల ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు చేసిన ప్రయత్నాలను బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసులు, బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరకు పోలీసులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News