Monday, June 23, 2025

ఎసిబికి చిక్కిన జిహెచ్‌ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్

- Advertisement -
- Advertisement -

బిల్లులు పై అధికారులకు పంపించేందుకు లంచం తీసుకుంటుండగా జిహెచ్‌ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టి.మనీష జిహెచ్‌ఎంసిలో వార్డ్ 2, నెహ్రూ నగర్, గోల్నాక , అంబర్‌పేట్ ఏరియాకు అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. బిల్లులను పై అధికారులకు క్లియర్ చేసి పంపించేందుకు లంచం డిమాండ్ చేసింది, ముందుగా రూ.5,000 తీసుకున్న మనీష,రూ.15వేలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేసింది.

డబ్బులు ఇవ్వకుంటే బిల్లులపై సంతకం చేసి పై అధికారులకు పంపించనని చెప్పడంతో బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మనీషకు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News