Tuesday, June 17, 2025

ఆ ఇద్దరు దిగ్గజాలు కలిస్తే శుభ్‌మాన్ గిల్: జోస్ బట్లర్

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండాలనే భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతోంది. యువ క్రికెటర్ శుభ్‌మాన్‌ గిల్ సారథ్యంలో జట్టు బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మాన్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడా.. అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ శుభ్‌మాన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిస్తే శుభ్‌మాన్ గిల్‌ అని ఆయన అన్నారు.

తన పాడ్‌కాస్ట్‌లో బట్లర్ మాట్లాడుతూ.. ‘‘శుభ్‌మాన్ తన ఆటతీరుతో ఆకట్టుకుంటాడు. అతను మాట్లాడేప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు.. కానీ, మైదానంలో దూకుడుగా ఉంటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిస్తే శుభ్‌మాన్ గిల్ అని నా అభిప్రాయం. అతను వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నాడు. కానీ, ఆటపై తనదైన సొంత ముద్ర వేస్తాడు. టెస్ట్ క్రికెట్‌కి కెప్టెన్‌గా వ్యవహరించడం దేశంలో మూడో లేదా నాలుగో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి హోదా లాంటిది. గిల్ క్రీజ్‌లో ఉన్నప్పుడు బ్యాటర్‌గా ఉండాలని.. ఆ తర్వాత అతను కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటాడు. అంటే రెండు పాత్రలకు అతను న్యాయం చేస్తాడు’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News