జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ ఫ్యాన్స్కి ఊహించని షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్వెల్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. మ్యాక్వెల్ చేతివేలు విరిగింది. అయితే ఈ సీజన్లో మ్యాక్స్వెల్ పెద్దగా ఫామ్లో లేడు. 7 మ్యాచులు ఆడిన అతను కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.
మ్యాక్స్వెల్కి తగిలిన గాయం చిన్నదే అని ముందు అనుకున్నామని.. తర్వాత పేెద్ద సమస్య అని అర్థం చేసుకున్నామని మార్కస్ స్టోయినిస్ అన్నాడు. వేలు విరిగినట్లు స్కానింగ్లో తేలిందని.. దీంతో అతను మిగితా టోర్నమెంట్కి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నాడు. మ్యాక్స్వెల్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నామని ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ పేర్కొన్నారు..