రూ.7,360 కోట్లతో ప్రాజెక్టు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి మూసీకి పునరుజ్జీవం
రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం
ఓఆర్ఆర్ ఫేజ్2లో భాగంగా ఇప్పటికే 15 రిజర్వాయర్ల నిర్మాణం
నేడు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3 పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.7360 కోట్లతో ప్రభుత్వం హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందులో ప్రభుత్వం 40శాతం పెట్టుబడి పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది. రెండేళ్లలో ఈ ప్రా జెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు. మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువుల ను నింపుతారు. డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రో జు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టు ను లక్ష్యంగా ఎంచుకున్నారు.
ఓఆర్ఆర్ ఫేజ్2లో భాగంగా జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని ము న్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పం చాయితీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్సీ పూరం, పటాన్చెరు, బొలారం మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి – నియో పోలీస్- సెజ్ కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందుతారు.
Also Read: ఎంపి అసదుద్ధీన్కు కృతజ్ఞతలు తెలిపిన సిఎం రేవంత్