Tuesday, September 16, 2025

షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్ తర్వాత భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దాదాపు 5వేల రూపాయల వరకు తగ్గి బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.69,000 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.63,250గా ఉంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల(తులం) బంగారం ధర రూ. 63,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,000గా ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రూ.89,000గా ఉంది. కాగా భారీగా ధరలు తగ్గడంతో బంగారం కొనుగోళ్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News