Sunday, June 1, 2025

నందినికి పసిడి

- Advertisement -
- Advertisement -

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణాల పంట

గూమి (దక్షిణ కొరియా): ఇక్కడ జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత్ మరో మూడు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. తెలంగాణకు చెందిన యువ సంచలనం నందిని అగసారా హెపాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఆసియా అథ్లెటిక్స్ హెపాథ్లాన్‌లో పసిడి పతకం గెలుచుకున్న మూడో భారత అథ్లెట్‌గా నిలిచింది. అద్భుత ఆటతో అలరించిన నందిని 5, 941 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది.

మరోవైపు పురుషుల 5,000 మీటర్ల నడకలో గుల్వీర్ సింగ్ స్వర్ణం సాధించి నయా చరిత్రను లిఖించాడు. అంతకుముదు 10,000 మీటర్ల విభాగంలో కూడా గుల్వీర్ పసిడి పతకం గెలుచుకున్నాడు. దీంతో ఒకే ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మహిళల హైజంప్‌లో భారత యువ అథ్లెట్ పూజా పసిడి పతకం దక్కించుకుంది. 18 ఏళ్ల పూజా 1.89 మీటర్ల ఎత్తుతో పూజా తొలి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ విభాగంలో పారుల్ చౌదరి రజత పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News