Monday, June 2, 2025

అంగన్‌వాడీలకు ప్రభుత్వం తీపి కబురు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ జీఓ జారీ చేసింది. ఈ మేరకు శనివారం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పెంపుతో పాటు, పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ. లక్ష ఉండగా తాజా ఉత్తర్వుల్లో దానిని రూ. 2 లక్షలకు పెంచింది. అంగన్‌వాడీ హెల్పర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ. 50వేలు ఉండగా దాన్ని రూ. లక్షకు ప్రభుత్వం పెంచింది. అంగన్‌వాడీ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు కాగా, వివిధ కారణాలతో 60 ఏళ్లు దాటిన తరువాత విఆర్‌ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News