భువనేశ్వర్: ఇంట్లోకి చొరబడి బాలికను పలుమార్లు పొడిచి చంపారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరపల్లి గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఖోరది జిల్లా జట్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు కరపల్లి గ్రామానికి చేరుకొని బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసి పారిపోయాడు. నిందితుడు సోదరి, బాలిక ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. గతంలో బాలికను ఆ యువకుడు వేధించడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఆమె స్నేహితురాలు అదృశ్యమైనట్టు సమాచారం.
ఇంట్లోకి చొరబడి బాలికను పలుమార్లు పొడిచి
- Advertisement -
- Advertisement -
- Advertisement -