Tuesday, June 17, 2025

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతు భరోసా (Rythu Bharosa) నిధుల పంపిణీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రులతో సమావేశం అనంతరం సిఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

జిల్లా ప్రజాప్రతినిధులతో ఇంచార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇక పాతబస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.125 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించింది. అందులోనుంచి రూ.125 కోట్లు విడుదల చేస్తూ.. పరిపాలన అనుమతులు ఇచ్చింది. అంతేకాక.. వేములవాడ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News