Thursday, September 4, 2025

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

- Advertisement -
- Advertisement -

తిరుపతితిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తంపంచగవ్య ప్రాసన చేపట్టారుఅనంతరం కల్యాణ మండపం నందు స్నపన తిరుమంజనంశాత్తుమొరఆస్థానం చేపట్టారు.

సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం  చేపట్టారురాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం మూలవర్లకుఉత్సవర్లకు ఉప సన్నిధిలో పవిత్ర సమర్పణ చేపడుతారుఅనంతరం విమాన ప్రాకరంధ్వజస్తంభం, మాడవీధులలోని శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు.

 కార్యక్రమంలో పెద్ద జీయర్, చిన్న జీయర్లుటిటిడి డిప్యూడీ ఇఒ వి.ఆర్శాంతి,  ఎఇఒ ఏబీ నారాయణ చౌదరిసూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకులభక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News