Friday, May 30, 2025

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి
ఈనెల 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం
గతేడాది కంటే ఈసారి అధికంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఈ ఏడాది యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 60.14 లక్షల
ఎకరాల్లో వరి సాగు
మొత్తం 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల (Grain purchase) ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతేడాది 2023-, 24 సంవత్సరం ఇదే సమయానికి 29.88 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.

దీంతోపాటు 2022,-23లో 19.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు (Grain purchase) జరిగాయని గత ఏడాదితో పోలిస్తే యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎక్కువ కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని అధికారులు పేర్కొన్నారు. 2023,-24లో 7,178 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈసారి 8,245 కేంద్రాలు నెలకొల్పినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, మొత్తం 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

కొనుగోలు చేసిన ధాన్యంలో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం

ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కాగా, 15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ఉన్నాయి. ఇప్పటివరకు 6 లక్షల 58 వేల మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించినట్టు అధికారులు తెలిపారు. దాదాపు పది వేల కోట్ల (రూ.9,999.36 కోట్ల) విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం అమ్మిన రైతులకు పౌర సరఫరాల విభాగం వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఇప్పటికే రూ.6671 కోట్ల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500ల చొప్పున ప్రభుత్వం బోనస్‌గా చెల్లించింది. యాసంగిలో ఇప్పటివరకు సన్న రకం ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం రూ.767 కోట్లు బోనస్ చెల్లించనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News