Saturday, June 7, 2025

హనీమూన్… సికింద్రాబాద్‌లో వరుడు ప్రాణం తీసిన రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హనీమూన్ కోసం గోవా వెళ్ల్లేందుకు నవ దంపతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైలు, ప్లాట్‌పామ్ మధ్య ఇరుక్కొని వరుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన ఉరగొండ సాయి(28) మూడు నెలల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్ కోసం భార్యతో కలిసి గోవాకు వెళ్లాలనుకున్నాడు. బావ, బావమరిది, భార్య, నలుగురు స్నేహితులతో కలిసి గోవా వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. 9వ నంబర్ ప్లాట్‌పామ్‌పై వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు.

రైలు బయలుదేరడానికి సమయం ఉండడంతో వాటర్ బాటిల్ తీసుకునేందుకు రైలు దిగాడు. రైలు బయలు దేరడంతో స్నేహితులు చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. రైల్వే పోలీసులు బోగికి చేరుకొని స్నేహితులను పట్టుకున్నారు. ఫైన్ చెల్లిస్తామని తన స్నేహితులను వదిలిపెట్టాలని పోలీసులను సాయి కోరాడు. అప్పుడే రైలు బయలుదేరుతండడంతో సాయి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించాడు. దీంతో రైలు, ప్లాట్‌పామ్ మధ్య ఇరుక్కొవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News