Thursday, June 26, 2025

మంచు విష్ణు కార్యాలయంలో జిఎస్టి అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో జిఎస్టి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. లెక్క ప్రకారం జిఎస్టి కట్టారా? లేదా? అనే విషయంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందని.. అయినా దాచి పెట్టేదేమీ లేదని.. ఎక్కడెక్కడ అప్పుడు చేశామో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఇక సినిమా గురించి విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ.. సినిమా హిందీ వర్షెన్ ఫైనల్ కాపీ చూశానని.. సినిమా ఆఖర్లో రోమాలు నిక్కబొడుకున్నాయని.. అక్కడి ప్రముఖులు చెప్పారని అన్నారు. ప్రేక్షకులు కూడా అదే చెబుతారని ఆశిస్తునట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు, భక్తుడు మధ్య జరిగే కథ ఇది అని.. కన్నప్ప గురించి ఈ తరానికి తెలియాలని ఉధ్దేశంతో ఈ సినిమా తెరకెక్కించామని విష్ణు పేర్కొన్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News