లేడీ సూపర్ స్టార్ నయనతార, (Nayanthara) కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. కాగా సోమవారం తమ మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నయనతార పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో స్వచ్ఛమైన ప్రేమను(Pure love) పంచుతున్నందుకు విఘ్నేశ్ కు నయన్ ధన్యవాదాలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది. “ఒకరిపై ఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనేది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయమే.. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు”అంటూ నయనతార తెలిపింది.
స్వచ్ఛమైన ప్రేమను చూపించావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -