Tuesday, June 10, 2025

ఇంజినీర్లదే బాధ్యత

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ ఎంపిక నాటి ప్రభుత్వానిది
కాదు తుమ్మిడిహట్టి వద్ద నీటి
లభ్యత లేదని సిడబ్లుసి చెప్పింది
కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్
లైడార్ సర్వే చేసి మూడు
బ్యారేజీలను ప్రతిపాదించింది
టెక్నోక్రాట్స్ నిర్ణయం మేరకే
అన్నారం, సుందిళ్ల ఇంజినీర్ల
డిటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజీ
లొకేషన్ మారింది నీళ్లు అమ్మి
రుణాలు తీర్చాలని భావించాం
కాళేశ్వరం కమిషన్ ఎదుట నాటి
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
వాంగూలం విచారణ
అనంతరం ఎర్రవెల్లిలో కెసిఆర్‌తో
హరీశ్‌రావు భేటీ బుధవారం
కమిషన్ ఎదుట హాజరు
కానున్న కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ విచారణకు సోమవారం మాజీ నీటిపారుదల శా ఖ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు హాజరయ్యారు. దాదాపు 42 నిమిషాల పాటు జస్టిస్ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్‌రావును క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొదటగా హరీష్‌రావు తాను తెలుగు మీడియంలో చదువుకున్నానని, పూర్తిగా ఆంగ్లంలో కమిషన్‌కు వివరించలేనని విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వాదనలు నమోదు అవుతున్న తీరును తెరపై(గోడపై) చూస్తూ ని ధానంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని జస్టిస్ ఘోష్ ఆయనకు స్పష్టం చేశారు. కమిషన్ ముం దు ఆయన ప్రమాణం చేసిన తదుపరి కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ ప్రారంభించింది.

ప్రశ్న : మీరు ఏ కాలంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు
జవాబు : తెలంగాణ తొలి కేబినేట్‌లో 2014 జూన్ 2వ తేదీ నుంచి 2018 నవంబర్ వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా విధులు నిర్వహించా.
ప్రశ్న : ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేబినేట్ సబ్ కమిటి జీఒ 665 ప్రకారం ఏర్పాటు అయ్యింది కదా
జవాబు : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక ప్రాజెక్టులు అంతరాష్ట్ర వివాదాలు, నీటి కేటాయింపుల వివాదాలు ఉం డేవి. ప్రారంభంలో సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి) అనుమతులు, నీటి కేటాయింపులు ఉన్న వాటిపై రాష్ట్ర ప్ర భుత్వం రీ ఇంజినీరింగ్ ద ఆన్ గోయింగ్ ప్రాజెక్టు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్నిఏర్పాటుచేసింది. అందులో తనతో పాటు నాటి ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. సబ్ కమిటి ఒక మాండేట్ రికమండేషన్లతో రీ ఇంజినీరింగ్ ప్రాజెక్టులను సిఫార్సు చేసింది. పాత ప్రాణహిత చేవెళ్ల కన్ఫామ్ టు ఆదిలాబాద్ వరకు ఉంది. దానిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళగా పేరు మార్చారు. రెండోవది కాళేశ్వరం. దీనికి ఏడు లింక్స్ ఉన్నాయి. సిడబ్లూసి తుమ్మిడిహట్టి వద్ద నీటిలభ్యత లేదని నిర్ధారించింది. దాంతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది.

ప్రశ్న : నీటి లభ్యత లేదనే మార్చారా
జవాబు : వివరాలు నేను చెబుతాను, అందుకు సంబంధించి నాదగ్గర ఉన్న రికార్డులు సబ్‌మిట్ చేస్తాను. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి నీటిపారుదల శాఖ మంత్రిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాను. 2014 జులై 23వ తేదీన నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్‌సి, చీఫ్ ఇంజినీర్, నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావులతో కలిసి ముంబాయికి వెళ్లి మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ తో సమావేశం అయ్యాము. ప్రాణాహిత ప్రాజెక్టు 7 లింక్స్, 27 ప్యాకేజీలను నిర్ధారించి టెండర్లను కూడా ఫైనల్ చేశామని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి వివరించాము. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పాము. మహారాష్ట్ర రైతులకు నష్టపరిహారం కింద ఎంతైన ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమని కూడా వెల్లడించాం. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన 45 రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాము. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్విరాజ్ చౌహాన్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖను మహారాష్ట్ర

నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రఫ్ మాకు చూపించారని కమిషన్‌కు ఆ లేఖను చూపించి దానిలోని సారాంశాన్ని చదివి వినిపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏపి సిఎంకు రాసిన లేఖలోనే స్పష్టం చేశాం, గత ఏడు సంవత్సరాలుగా ఏపి ప్రభుత్వం అడుగుతున్నా మేము అంగీకరించడంలేదు అని ఆయన వెల్లడించారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభమైంది. ఆ సమయంలో కేంద్రంలో యూపిఎ ప్రభుత్వం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మహారాష్ట్ర అందుకు అంగీకరించలేదు. అంతే కాకుండా మరో ఆరు, ఏడు నెలల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి, మీ(తెలంగాణ) విజ్ఞప్తిని ఏవిధంగా అంగీకరిస్తామని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రఫ్ చెప్పారు. దాంతో మేము వెనక్కి తిరిగి వచ్చాం.2014 ఆగస్టు 16వ తేదీన మహారాష్ట్ర ఇరిగేషన్ ఇంజినీర్లతో తెలంగాణ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. 2014 డిసెంబర్ 23న మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా గిరీష్ మహాజన్ బాధ్యతలు చేపట్టారు. సమస్య అంతరాష్ట్ర వివాదంగా ఉన్నందన నీటిపారుదల శాఖ మంత్రుల నిర్ణయంతో సాధ్యం కాదని, ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడి తీసుకోవల్సిన నిర్ణయంగా సూచించారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

ప్రశ్న : ఆ తర్వాత ఏమైంది
జవాబు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి 2015 ఫిబ్రవరి 17వ తేదీన అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన సిహెచ్.విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్‌లో సమావేశం జరిగింది. ఇదే సందర్భంగా రైతుల నష్టపరిహారం ఎంతైనా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పాం. కానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంపు గ్రామాల ప్రజలు అంశంపై తానుకూడా ఆందోళనలు చేశానని, పాత ప్రభుత్వం ఇవ్వకపోతే తమ ప్రభుత్వం ఎలా ఇవ్వగలుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
హెడ్ నిర్ణయం జరగకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి)కి కాంగ్రెస్ ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డిపిఆర్) ఇచ్చి పట్టించుకోలేదు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ యూపిఎ ప్రభుత్వం, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండి కూడా ఒక్క ప్రాజెక్టు అనుమతి సాధించలేదు, ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు, తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఆనాడు తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి పట్టించుకోలేదు.

2015 మార్చి 4వ తేదీన సెంట్రల్ వాటర్ కమిషన్(సిడబ్లూసి) నుంచి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. అందులో తుమ్మిడిహట్టి వద్ద 165 టిఎంసి నీటిలో 63 టిఎంసి నీటి కేటాయింపులు ఇతర ప్రాజెక్టులకు ఉన్నాయని, నీటిలభ్యత తగ్గుతుందని స్పష్టత ఇచ్చింది. అంతే కాకుండా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్ లైఫ్ ఉందని, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు కష్టమని, వైల్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు అవుతుంది సిడబ్లూసి నుంచి వచ్చిన లేఖల్లో పేర్కొంది.

ప్రశ్న : అందుకే మేడిగడ్డ ఎంచుకున్నారాం
జవాబు : మేడిగడ్డ ప్రాంతాన్ని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఎంచుకుని నిర్మించారనేది వాస్తవం కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసింది. (తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ కాళేశ్వరం కమిషన్‌కు అందజేసిన లేఖను చదివి వినిపించారు. 2015 ఫిబ్రవరి 18వ తేదీన నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి రాసిన లేఖలోని అంశాలను చదవివినిపించారు.) ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. వాస్తవానికి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిజైన్ చేసింది కూడా వ్యాప్కోస్ సంస్థే. సిఎం కెసిఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ప్రతిష్టాత్మకమైన లాడార్ సర్వే చేసి 2016 జనవరి 17న మూడు బ్యారేజిలను ప్రతిపాదించింది. వ్యాప్కోస్ సూచనల మేరకు డిపిఆర్‌లను రూపొందించి సెంట్రల్ వాటర్ కమిషన్‌కు పంపించాం.

ప్రశ్న : పరిపాలన అనుమతులు ఏవిధంగా తీసుకున్నారు
జవాబు : అన్నీ కేబినేట్ నిర్ణయాల మేరకే జరిగాయి. వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టుపై కూడా మంత్రివర్గం ఆమోదం తీసుకుంది.
ప్రశ్న : మరి అన్నారం, సుందిళ్ల సంగతి
జవాబు : అన్నారం, సుందిళ్ల టెక్నోక్రాట్స్ నిర్ణయం, ప్రజాప్రతినిధులుగా మాకు సంబంధం లేదు. ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారింది. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరిగింది. స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల, అటవీప్రాంతం ముంపు, గిరిజన ప్రాంతాల ముప్పు తదితర కారణాల వల్ల ప్రాజెక్టుల లొకేషన్ల మారిన ఉదంతాలు ఉన్నాయి.
ప్రశ్న : ఇంజినీరింగ్ రిపోర్టులు మీరు చూశారా
జవాబు : అవి టెక్నికల్ అంశాలు, ప్రభుత్వం అన్ని అధికారాలు హైపవర్ కమిటీకి ఇచ్చింది.
ప్రశ్న : కాళేశ్వరం కార్పొరేషన్ గురించి చెప్పండి
జవాబు : కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం.
ప్రశ్న : అంటే రూల్4(బి)
జవాబు : నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మా ట్యాగ్. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ కొత్త రాష్ట్రం. ప్రభుత్వానికి ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా కాళేశ్వరం కార్పొరేషన్ ను ఏర్పాటుచేయాల్సి వచ్చింది. తక్కువ వడ్డీతో ఆర్‌ఈసి, పిఎఫ్‌సి రుణాలు తీసుకున్నాం.

ప్రశ్న : కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్ రీపేమెంట్, జనరేటింగ్ రెవెన్యూ ఎలా అనుకున్నారు.
జవాబు : కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకునే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్ వాటర్ యూసేజ్ ద్వారా వనరుల సమీకరణకు కార్యచరణ ఉంది. ఒక్కసారి కూడా డిఫాల్ట్ కాలేదు. 2019 నుంచి 2021 వరకు రెండేళ్లు కరోనా సమయం. నీటి వినియోగానికి కోకకోలా వంటి పెద్ద కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి.
ప్రశ్న ; టారీఫ్ ఆలస్యం అయ్యిందా
జవాబు : అది నాకు తెలిసి కొంత కాలం
ప్రశ్న : టెండర్లు ఫైనలైజేషన్ అయ్యాక ఎగ్జిక్యూషన్ ముందు కండిషన్లు ఏమైనా మార్చారా
జవాబు : డిపెండ్ అప్ ఆన్ ఫీల్డ్ కండిషన్
ప్రశ్న : ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్టు ప్రకారం చేశారా
జవాబు : ఎక్స్‌పర్ట్ కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు ప్రాధాన్యత ఇచ్చింది అని మ్యాప్ ద్వారా వివరించారు. అయితే మధ్యలో ఎన్‌టిపిసి, కోల్ మైన్స్ ఉన్నాయి. కాబట్టి సాధ్యంకాలేదు.
ప్రశ్న : ఒక్కొక్క బ్యారేజిలో ఎంత స్టోరేజి అని నిర్ణయించారు
జవాబు : అన్ని బ్యారేజిల్లో కలిపి 141 టిఎంసి
ప్రశ్న : బ్యారేజీల్లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఏమేరకు ఉండాలి
జవాబు : అది ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయం
ప్రశ్న : స్టోరేజి ఎంత
జవాబు : ప్రజా ప్రతినిధులుగా మాకు సంబంధం లేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News