మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. తెలంగాణకు సాధించింది ఏం లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ తన్నీరు హరీష్రావు విమర్శించారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరైనా ఎంజిఎన్ఆర్ఇజిఎస్(నరేగా) పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని పేర్కొన్నారు. 2024 -25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం రూ. 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని హరీష్రావు కోరారు.