- Advertisement -
హైదరాబాద్: ట్రాక్టర్ల లో డిజిల్ పోయలేకనే… గ్రామాల్లో చెత్త సేకరించట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. .ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు అందట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంట్రాక్టర్లు 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు.సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వలేరు కాబట్టి జీతాలు ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి (Hyderabad – Delhi) వెళ్లేందుకే సిఎం రేవంత్ రెడ్డి కు సమయం సరిపోతుందని చురకలంటించారు. నెలకోసారి కూడా సిఎం సచివాలయానికి వెళ్లట్లేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
- Advertisement -