Tuesday, June 3, 2025

సూటిగా ఎదుర్కొనే దైర్యం లేకే దిగజారుడు రాజకీయాలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తో తాను రహస్యంగా సమావేశమయ్యారన్న మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూటిగా ఎదుర్కొనే దైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విలువలు విస్మరించి సిఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy) బాటలోనే నడుస్తున్నారని అన్నారు. బట్టకాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని విమర్శించారు. పెళ్లిలోనో, చావులోనో కలిసిన సందర్భాలే తప్ప వ్యక్తిగతంగా కలవలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News