Tuesday, June 17, 2025

హరీష్ రావుకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన సోమవారం రాత్రి బేగంపేటలోని సన్‌షైన్ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ వల్ల హరీష్‌రావు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. కెటిఆర్ ఎసిబి విచారణ నేపథ్యంలో హరీష్‌రావు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. కెటిఆర్ ఎసిబి విచారణ ముగిసిన తర్వాత ఆయన కెటిఆర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.అయితే అప్పటికే హరీష్ రావు జ్వరంతో బాధపడుతుండగా.. సమావేశంలో చాలాసేపు నిలబడి ఉండటం వలన ఆయన మరింత అస్వస్థతకు గురయ్యారు. కాగా హుటాహుటిన ఆయనను సన్‌షైన్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరీష్ రావు అనారోగ్య సమాచారం తెలుసుకున్న బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News