- Advertisement -
మాజీ మంత్రి హరీష్రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కమిషన్.. హరీష్ రావును ప్రశ్నించింది. సుమారు 45 నిమిషాల పాటు హరీష్రావు విచారణ కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్కు అన్ని ఆధారాలు సమర్పించానని తెలిపారు. మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్లే రీడిజైనింగ్ చేసినట్లు కమిషన్కు తెలిపినట్లు హరీష్ రావు చెప్పారు. వాప్కోస్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మారిందని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజినీర్లు చెప్పారని హరీష్ రావు తెలిపారు.
- Advertisement -