బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్తో మాజీ మంత్రి హారీష్రావు సమావేశమయ్యారు. గురువారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీష్రావు.. విచారణ ముగిసిన తరవాత నేరుగా కెసిఆర్తో సమావేశం కావడానికి ఎర్రవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన వివరాలను ఆయన కెసిఆర్తో పంచుకున్నట్లు తెలిసింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సాక్ష్యాధారాలతో సమాధానం ఇచ్చిన అంశాలను హరీష్రావు కెసిఆర్కు వివరించినట్లు సమాచారం.
విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రస్తావిస్తున్న అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. బుధవారం(జూన్ 11) కాళేశ్వరం కమిషన్ విచారణకు కెసిఆర్ హాజరుకానున్నారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్న కెసిఆర్, విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రశ్నలపై పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు తెలిసింది. కెసిఆర్ ఇప్పటికే పలుమార్లు హరీష్రావుతో సమావేశం కాగా, న్యాయనిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లతో సంప్రదింపులు జరిపారు.