- Advertisement -
గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అరెస్టు చేయడమే కాకుండా నేరస్తుల లాగ రైతులకు చేతులకు సంకెళ్ళు వేయడం పట్ల మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. లగచర్ల నుంచి రాజోలి దాకా ఇలాంటి ఘటనలే పునరావృత్తం అవుతున్నాయని పేర్కొన్నారు. రైతు చేతులకు సంకెళ్లు వేయడం, పౌర హక్కుల నేతలపై నిర్బంధాలు విధించడం.. ఇవేనా సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఆనవాళ్ళు అంటూ ప్రశ్నించారు.
- Advertisement -