Sunday, June 15, 2025

తెలంగాణకు అన్యాయం.. ఎపి జల దోపిడికి బిజెపి పూర్తి మద్దతు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ జల దోపిడికి పాల్పడుతోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఎపి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ బిజెపి నేతలు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎపి జల దోపిడికి బిజెపికి పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. న్యాయబద్ధంగా రెండు రాష్ట్రాలకు కేంద్రం నీళ్లు పంచాలని.. కానీ ఎపికి బిజెపి మద్దతు తెలుపుతుందని చెప్పారు.

పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం.. నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, బండి సంజయ్.. ప్రధాన మంత్రితో మాట్లాడి ఎపి నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఎపి జల దోపిడిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. లేకపోతే, బిఆర్ఎస్ ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి శ్రీకారం చుడుతుందని హరీష్ రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News