భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. తక్కువ మంది అనుభవజ్ఞులు ఉన్న జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్.. ఇంగ్లండ్ని ఎలా ఎదురుకుంటుందో అని అంతా వేచి చూస్తున్నారు. ఈ సిరీస్కి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతను శుభ్మాన్ గిల్కి అప్పగించారు. ఇక వైస్ కెప్టెన్ స్థానం రిషబ్ పంత్కి దక్కింది. మొదటిసారిగా సాయి సుదర్శన్ జట్టులో చోటు సంపాదించుకోగా.. శార్ధూల్ ఠాకూర్, కరుణ్ నాయర్లు సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్లు ఐదుగురు బౌలర్లు ఉణన్నరు. ఇప్పటికాదా ఈ ఐదుగురు బౌలర్లతో పటిష్టంగా ఉన్న భారత్కు మరింత బలం చేకూర్చుస్తూ.. మరో బౌలర్ని జట్టులోకి తీసుకున్నరు. అతనే హర్షిత్ రాణా (Harshith Rana). గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగన సిరీస్లో హర్షిత్ టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో50.75 యావరేజ్తో నాలుగు వికెట్లు తీశాడు.భారత్ ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్కు మధ్య జరిగిన మొదటి అనధికార టెస్టులో హర్షిత్ రాణా 99 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్లో 16 పరుగులు చేశాడు. అయితే హర్షిత్ గురించి బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.