Wednesday, September 17, 2025

డబ్బులు దోచుకొని…. మర్మాంగాన్ని కట్ చేసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: ఓ వ్యక్తి దగ్గర దుండగులు దోచుకున్న అనంతరం అతడి మర్మాంగాన్ని కట్ చేసిన సంఘటన హర్యానాలో గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురుగ్రామ్ సెక్టార్-37 ప్రాంతంలో ధర్మేంద్ర అనే వ్యక్తి రాత్రి పది గంటల సమయంలో పని చేసే కంపెనీకి వెళ్తుండగా అతడిని నలుగురు దొంగలు పట్టుకున్నారు. ధర్మేంద్ర వాళ్ల నుంచి తప్పించుకొని పారిపోయాడు. కొంచెం దూరం వెళ్లిన తరువాత నలుగురు దుండగులు ధర్మేంద్రను పట్టుకొని అతడి వద్ద నుంచి నగదును లాక్కున్నారు. వెంటనే అతడు కిందపడిపోవడంతో ఓ దుండగుడు కత్తి తీసి ధర్మేంద్ర మర్మాంగాన్ని కట్ చేశారు. ధర్మేంద్ర వెంటనే తన సోదరుడికి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్ప్రత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News