ఛండీగఢ్: భర్త విదేశాలలో ఉండడంతో అప్పుడే పుట్టిన పసికందు నోట్లో బూడిద పోసి, గొంతు నులిమి కన్నతల్లి చంపింది. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం కైథాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఓ వితంతువు తన కుమారుడు 2015లో వివాహం చేసింది. తన కుమారుడు ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత మూడు సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం ఫోర్చుగల్ దేశానికి వెళ్లాడు. గత ఆరు నెలల క్రితం తన కొడలు గర్భం దాల్చిందని అత్త అనుమానం వ్యక్తం చేసింది. తాను గర్భవతిని కాను పొట్ట పెరుగుతోందని కోడలు జవాబిచ్చింది. జూన్ 11న రక్తస్రావంతో కొడలు ఇంట్లో పడిపోవడంతో అత్త అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వితంతువు కూతురు పశువుల పాకలోనికి వెళ్లి చూడగా స్కూల్ బ్యాగులోని పాలిథీన్ కవర్ లో పసికందు మృతదేహం కనిపించింది. ఈ కవర్లో పసికందు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం కోడలు అనారోగ్యంగా ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే గర్భవతి అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసికందు మృతదేహానికి డిఎన్ఎ టెస్టు కోసం రక్త నమూనాలను ల్యాబ్కు పంపించారు.