Tuesday, June 3, 2025

హయత్ నగర్ లో డిసిఎంను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధి కుంట్లూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న డిసిఎంను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన ఒక్కరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్  జామ్ కావడంతో వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతులు కుంట్లూరు గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.  అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు బావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News