- Advertisement -
కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 8 గేట్లను 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 2,93,609 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది. ఇక, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
- Advertisement -