- Advertisement -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు అలమట్టి, నారాయణ పూర్ డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం వైపునకు 58,722 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో పాటు జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 31,852 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా సుంకేసుల బ్యారేజీ ద్వారా మరో 2,215 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి మొత్తం 92,789 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైల జలాశయానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా మే మాసంలోనే వరద రావడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది.
- Advertisement -