Wednesday, September 17, 2025

బిజెపి కుట్రతోనే ఢిల్లీలో భారీ వరదలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్రం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దేశ రాజధానికి నీటిని విడుదల చేయడం వల్లే నగరంలో వరదలు సంభవించాయని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. విలేకరుల సమావేశంలో భరద్వాజ్ మాట్లాడుతూ… గత 3-4 రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడలేదని, ఇప్పటికీ యమునాలో నీటి మట్టం 208.66 మీటర్లకు చేరుకుందని అన్నారు.

“హత్నికుండ్ బ్యారేజీ నుండి నీటిని పశ్చిమ కాలువ, తూర్పు కాలువ, యమునా అనే మూడు కాలువల నుండి విడుదల చేస్తారు. కుట్రలో భాగంగా, జూలై 9, 13 మధ్య, యమునా కాలువ నుండి ఢిల్లీ వైపు మాత్రమే నీటిని విడుదల చేశారు. పశ్చిమ, తూర్పు కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేయడం లేదు’ అని ఆయన ఆరోపించారు. వికాస్ మార్గ్‌లో వరదలకు కారణమైన విరిగిన రెగ్యులేటర్‌పై నగర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనాతో తలలు పట్టుకున్నప్పటికీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఇలాంటి ఆరోపణలు చేశారు. శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తాజా ఆరోపణపై బిజెపి నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News