Monday, June 30, 2025

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

- Advertisement -
- Advertisement -

కర్నూల్ జిల్లా నంద్యాల పరిధిలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 1,56,554 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 872.50 అడుగులకు చేరుకుంది. అలాగే, పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 152.4941 టీఎంసిలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News