Tuesday, September 2, 2025

మూడు రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశ మార్చుకుందని దీంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News