Saturday, June 14, 2025

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

నైరుతి రుతుపవనాలు చరుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. శనివారం రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్క కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని,

ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, పిడుగులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News