Friday, May 30, 2025

జోరు వానలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి రెండు రోజుల
పాటు భారీ వర్షాలు నేడు జయశంకర్
భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం
జిల్లాల్లో అతి భారీ వర్షాలు

రాష్ట్రమంతా నైరుతి రుతుపనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 26వ తేదీన మహబూబ్‌నగర్‌ను తాకిన నైరుతి ఆదిలాబాద్ వరకు చేరుకుని ప్రస్తుతం రాష్ట్రమంతా విస్తరించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ మేరకు రాష్ట్రంలో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

రెండు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు,పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News