- Advertisement -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ కేంద్రం(ఐఎండి). బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. గురువారం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది.
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని తెలిపింది. ఈ క్రమంలో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 15 జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, ఎపిలోని అల్లూరి జిల్లా, మన్యం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ.. ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరింది.
- Advertisement -