- Advertisement -
‘సత్యం సుందరం’తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు , ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తీని ఇంటెన్స్గా చూపించిన అద్భుతమైన పోస్టర్ తో మేకర్స్ గురువారం ‘మార్షల్’ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. శుభ పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్షల్ను అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
- Advertisement -