Friday, June 6, 2025

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట… సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనను కర్నాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టులో విచారణ జరుగుతోంది. అన్ని వివరాలతో నివేదికఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై ఇంకా పోలీసులు స్పష్టతకు రాలేదు. ఊహించని ఘటనలో 11మంది చనిపోయారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులు ఎవరో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించలేదు. విషాద ఘటనపై 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసులకు ఆదేశించారు.  18 సంవత్సరాల తరువాత ఐపిఎల్ కప్ సాధించడంతో ఆర్‌సిబి జట్టు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించడంతో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News