Wednesday, June 25, 2025

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. 2021, జూలై 26వ తేదీన మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఆ కార్యక్రమంలో అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతిలో మైక్ లాక్కున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని మంత్రి ఆదేశాలతో చౌటుప్పల్ తహీశీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో తనపై కేసును కొట్టివేయాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. చౌటుప్పల్ పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని రాజగోపాల్ రెడ్డి తరపు న్యాయవాది వాదనను వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News