లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన డబ్ల్యూటిసి ఫైనల్స్లో (WTC Final) ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా (South Africa) 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సుమారు 27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐసిసి ట్రోఫీని గెలుచుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్లో మార్క్రం(136) పరుగులతో చెలరేగిపోగా.. కెప్టెన్ బావుమా (64) కీలక ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే డబ్ల్యూటిసి (WTC Final) విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికాకు (South Africa) దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకుందాం. డబ్ల్యూటిసి విజేతగా నిలిచినందుకు దక్షిణాఫ్రికాకు 3.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.31.05 కోట్లు) ప్రైజ్ మనీగా ఇచ్చారు. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి ప్రైజ్ మనీని రెండింతలు పెంచారు. ఇక ట్రోఫీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకి దక్కిన ప్రైజ్ మనీ 2.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18.63 కోట్లు). ఇక డబ్ల్యూటిసి సైకిల్లో మూడో స్థానంలో ఉన్న భారత జట్టుకు 1.44 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.12.42 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది.