- Advertisement -
మన తెలంగాణ/మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మినర్సింహాస్వామి దేవాలయంలో భక్తులు ఆదివారం సందడి చే శారు. ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా చింతామణి తోగును సందర్శించి పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం స్వామివారి గర్బాలయానికి చేరుకుని లక్ష్మినర్సింహా స్వామివారిని దర్శించుకుని మోక్కులు సమర్పించుకున్నారు. ఇందులో బాగంగానే ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి వారి విషిస్టతను ఆలయ చరిత్రను భక్తులకు వివరించారు. అనంతరం గుట్ట క్రింది బాగంలోని దైత అమ్మవారిని దర్శించుకుని అక్కడే సహపంక్తి బోజనాలను చేశారు. గుట్ట ప్రాంతాన్ని పరిశీలించి సందడి చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖ ర్ శర్మ, పవన్ కుమారాచార్యులు, ఈశ్వర్ చంద్, సిబ్బంది సీతారాములు, శేషు, అజయ్, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -