Thursday, September 18, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. సోమవారం తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండానే.. భక్తులు నేరుగా స్వామివారి సర్వదర్శనం చేసుకుంటున్నారు. ఇక, ఆదివారం తిరుమల వెంకన్నను 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,694 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.53 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News