Sunday, June 15, 2025

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 16 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న(సోమవారం) శ్రీవారిని 78,349 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 39,634 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 4.56 కోట్ల ఆదాయం వచ్చినట్టు టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News