Tuesday, September 16, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారికి 36,784 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక, ఆదివారం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్‎మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News