- Advertisement -
హైదరాబాద్: కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. హుజురాబాద్ అనేక త్యాగాలకు అడ్డా అని అన్నారు. హుజూరాబాద్ బిజెపి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశానని, బిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలియజేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల విషయంలో తాను మోహమాటం లేకుండా చెప్పానని ఈటల వివరించారు. గతంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో (Huzurabad election) ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
- Advertisement -