Thursday, June 12, 2025

హైదరాబాద్ ఇక సినీ సిటీ

- Advertisement -
- Advertisement -

డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు

సిద్ధం చేయండి గద్దర్ అవార్డుల
కార్యక్రమం అంగరంగవైభవంగా
నిర్వహించాలి థియేటర్లలో
తినుబండారాల ధరల
నియంత్రణకు చర్యలు చేపట్టాలి
సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ
సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్: సినిమా సిటీకి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క సమాచార శాఖ కమిషనర్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోఎ మంత్రులు, సబ్ కమిటీ సభ్యులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం తెలిపారు.

వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఒక అధికారిని నియమించి వారి ద్వారా అన్ని శాఖల నుంచి అనుమతులు త్వరితగతన ఇప్పించేలా సింగిల్ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. సినిమా థియేటర్లలో క్యాంటీన్ల ద్వారా విక్రయిస్తున్న తినుబండారాలు, ఇతర వస్తువులు అత్యధిక రేట్లకు విక్రయిస్తుండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు మంజూరు చేసిందని, ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి వాటి వివరాలను వచ్చే సమావేశం నాటికి తీసుకు రావాలని సబ్ కమిటీ అధికారులను ఆదేశించారు. సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ పై ఏర్పాటుచేసిన ఆర్‌సీఎస్ కమిటీని వచ్చే సమావేశానికి పిలిపించాలని సూచించారు. ఈనెల 14న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఫంక్షన్ ను నభూతో..న భవిష్యత్తు అన్నట్టుగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖులందరినీ ఆహ్వానించాలని, తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ సిఎస్ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీష్, ఎఫ్‌డిసి డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News