- Advertisement -
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మాదాపూర్ యశోద ఆస్పత్రి సమీపంలో దొంగలు కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. అర్థరాత్రి ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా దొంగలు వారిని బెదిరించి బంగారం, డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఇద్దరు యువకులు ఎదురుతిరగడంతో వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి ఖాజాగూడకు చెందిన జయంత్ గౌడ్ అని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -