Friday, September 12, 2025

మ్యాన్ హోల్ మూతను మూసేందుకు తక్షణమే చర్యలు: కమిషనర్ రంగనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురాలో స్కూల్ కు వెళ్తూ మ్యాన్ హోల్ లో చిన్నారి పడిపోయిందని, మూతలేని మ్యాన్ హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ స్పందించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని అన్నారు. మ్యాన్ హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని తెలియజేశారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

Also Read : రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News