Sunday, June 15, 2025

ఆ విషయంలో ఆశ పడ్డా బిసిసిఐ.. కుదరదని తేల్చేసిన ఐసిసి

- Advertisement -
- Advertisement -

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు (డబ్ల్యూటిసి) ప్రత్యేక స్థానం ఉంది. మరీ ప్రధానంగా డబ్ల్యూటిసి ఫైనల్ అంటే ప్రేక్షకదరణ రెట్టింపు ఉంటుంది. ప్రస్తుత సీజన్‌ డబ్ల్యూటిసి ఫైనల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ఈ సీజన్‌తో కలిపి ఇప్పటివరకూ జరిగిన మూడు డబ్ల్యూటిసి ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే (సౌతాంప్టన్, ఓవల్, లార్డ్స్) జరిగాయి. అయితే వచ్చే సీజన్‌లో డబ్ల్యూటిసి ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిసిసిఐ (BCCI) ఆసక్తి చూపిస్తుందని సమాచారం. కానీ, అది కుదరదని ఐసిసి (ICC) తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే మూడు సీజన్లు కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. దీనిపై వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

2027, 2029, 2031 డబ్ల్యూటిసి ఫైనల్స్‌లో ఏదో ఒక ఫైనల్‌ని భారత్‌లో నిర్వహించేందుకు బిసిసిఐ (BCCI) ప్రయత్నాలు చేస్తోందట. కానీ, ఈ మూడు ఫైనల్స్ నిర్వహించే హక్కులను ఇంగ్లండ్‌కే ఇవ్వాలని ఐసిసి (ICC) నిర్ణయించిందట. దీనిపై ఇప్పటికే ఇంగ్లండ్ బోర్డుకు ఐసిసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జులైలో సింగపూర్ వేదికగా జరిగే ఐసిసి వార్షిక సదస్సులో దీన్ని అధికారికంగా ఆమోదించి.. ప్రకటన విడుదల చేయనున్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి డబ్ల్యూటిసి ఫైనల్‌లో సౌతాఫ్రికా విజయానికి చేరువలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News