Tuesday, June 17, 2025

అక్టోబర్ 5న పాకిస్థాన్‌తో భారత్ పోరు

- Advertisement -
- Advertisement -

భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించి షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ వరల్డ్‌కప్ జరుగనుంది.సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంకలు తలపడుతాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ ఈ మ్యాచ్ జరుగనుంది. బిసిసిఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య హైబ్రిడ్ మోడల్ కోసం ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను తటస్థ వేదికలో నిర్వహించనున్నారు. ఇక మొదటి సెమీ ఫైనల్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో నిర్వహిస్తారు. రెండో సెమీ ఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరుగుతోంది.

ఇక ఫైనల్‌ను నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో నిర్వహించేందుకు ఐసిసి సిద్ధమైంది. ఒక వేళ పాకిస్థాన్ నాకౌట్ పోటీలకు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లను శ్రీలంకలోనే నిర్వహిస్తారు. ఇక వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో మొత్తం 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న శ్రీలంకతో, అక్టోబర్ 5న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో విశాఖపట్నంలో, 12న విశాఖపట్నంలోనే ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో, 23న గౌహతిలో న్యూజిలాండ్‌తో, 26న బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News